- ఒక స్పూన్ నిమ్మరసంలో 1/2 స్పూన్ తేనె కలిపి నల్లని మచ్చలు ఉన్న ప్రదేశములో రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా 1 నెల పాటు చేస్తే మచ్చలు తగ్గిపోతాయి.
- 1 స్పూన్ పాలలో చిటికెడు పసుపు మరియు టమాటో రసం వేసి బాగా కలిపి నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాలు ఆగి చల్లని నీటి తో కడిగేయాలి .ఇలా ప్రతి రోజు చేస్తే మచ్చలు మరియు నలుపు కూడా తగ్గి, చర్మ ఛాయ కూడా మెరుగు పడుతుంది.
- బంగాళాదుంప రసం తీసి నల్ల మచ్చల పైన ప్రతి రోజు రాయటం వలన కూడా నలుపు క్రమముగా తగ్గిపోతుంది.
- 1 స్పూన్ పెరుగులో 1 స్పూన్ నిమ్మరసం, కొంచెం పసుపు వేసి బాగా కలిపి ప్రతి రోజు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయుట వలన చర్మం నలుపు తగ్గి, మచ్చలు మటుమాయం అయిపొతాయి.
- 1- టీస్పూన్ చందనం పౌడర్ తీసుకుని దానిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసుకోవాలి .ఆ పేస్ట్ ని నల్లమచ్చలు ఉన్న చోట రాసి ఆరిపోయాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయటం వలన మచ్చలు తగ్గిపోయి, ముఖం నునుపుగా తయారు అవుతుంది.
Sunday 16 October 2016
Tips for spotless skin
Labels:
beauty TIPS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment